NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Floods: ఏపి సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ ..! రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా..!!

AP Floods: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా భీభత్సకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. అనంతపురం జిల్లా చిత్రావతి నది వరద ఉగ్రరూపు దాల్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేడు ఎంపి సీఎం వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. ఏపిలో వర్షాలు, వరదల పరిస్థితులపై ప్రధాన మంత్రి మోడీ ఆరా తీశారు. నిన్నటి నుండి ఏపిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల గురించి సీఎం జగన్ ను పీఎం మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ చర్యల గురించి, అయిదు జిల్లాల్లో వర్షాలు, వరదల పరిస్థితి గురించి ప్రధాని మోడీకి సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంలో కేంద్రం నుండి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ప్రధాని మోడీ సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం జగన్ వివరించారు. సహాయక చర్యల కోసం నావీ హెలికాఫ్టర్ లను కూడా వినియోగించుకుంటున్నట్లు ప్రధాన మంత్రి మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకువచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పలు జిల్లాల్లో చెరువులకు గండ్లు పడుతున్నాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ప్రధాని మోడీ దృష్టికి జగన్ తీసుకువచ్చారు.

AP Floods: PM Modi phone call to ap cm ys jagan over flood situation
AP Floods: PM Modi phone call to ap cm ys jagan over flood situation

AP Floods: కడప జిల్లాలో భారీ ప్రాణనష్టం

భారీ వర్షాల కారణంగా కడప జిల్లా రాజంపేట లో భారీ ప్రాణనష్టం జరిగింది. నందలూరు పరివాహక ప్రాంతంలో గల మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో మూడు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకుని సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల్లో 12 మృతదేహాలను వెలికితీశారు. చిత్రావతి నదిలో ఓ కారు గల్లంతు అవ్వగా నదిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. అయితే కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం పది మంది తిరిగి బయటకు వచ్చే పరిస్థితి లేక నదిలోనే ఓ జేసీబీపైనే ఉండిపోయారు. ఈ విషయం అసెంబ్లీ సమావేశంలో ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి తెలియడంతో వెంటనే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం స్పందించిన సీఎం జగన్ అనంతపురం జిల్లా కు హెలికాఫ్టర్ పంపాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అక్కడకు హెలికాఫ్టర్ చేరుకుని చిత్రావతి నదిలో చిక్కుకున్న పది మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju