Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ గేమ్ చివరి దశకు చేరుకున్న క్రమంలో హౌస్ లో ఉన్న సభ్యులకు టెన్షన్ పెరిగిపోతుంది. హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది సభ్యులు మిగిలి ఉన్నారు. వీరిలో టైటిల్ ఎవరు గెలుచుకుంటారు..?, ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బయట అంచనాల ప్రకారం ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో మగ వాళ్ళు ఏమంటారు. అటో ఇటో అయితే మానస్(Manas) ఎలిమినేట్ అయ్యి… ఆడవాళ్ళలో కాజల్(Kajal) లేదా సిరి(Siri) టాప్ ఫైవ్ లో నిలుస్తారు అని బయట జనాలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ లో.. ఇప్పటికే కాజల్ అదేరీతిలో శ్రీ రామ్ చంద్ర కి చెందిన కుటుంబ సభ్యులు రావడం జరిగింది. ఇదిలా ఉంటే టాప్ మోస్ట్ కంటెస్టెంట్ లో మంచి క్రేజ్ ఉన్న షణ్ముక్(Shanmuk) ఈ విషయంలో వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ లో… అడుగుపెట్టనున్నారు అని టాక్. కాగా షణ్ముఖ్ మాత్రం ఎప్పటి నుండో తన బెస్ట్ ఫ్రెండ్ దీప్తి సునయన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గత వీకెండ్ ఎపిసోడ్ లో కూడా నాగార్జున(Nagarjuna)కి ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో ఈ వీకెండ్ లో… దీప్తి సునయన నాగార్జునతో పాటు వేదికపై రానున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే గత సీజన్లలో ఆడిన ఒక మాజీ కంటెస్టెంట్ నీ తీసుకొచ్చే ఆలోచనలో..షో నిర్వాహకులు ఉన్నట్లూ…ఈ సమయంలో.. దీప్తి సునయన సెకండ్ సీజన్ లో.. ఉండటంతో.. ఆమెను ఈవారం బిగ్బాస్ వేదికపై.. తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు అని టాక్. ఈ రీతిగా హౌస్ కి చివరివారంలో కెప్టెన్ అయిన షణ్ముఖ్ కి బిగ్ సర్ ప్రైజ్..షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.