Breaking: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నేడు కీలక ప్రకటన చేశారు. తనపై అనర్హత వేటు వేయించాలనీ రెండేళ్లుగా తమ పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారనీ, అయినప్పటికీ వారి ప్రయత్నాలు సాధ్యం కాలేదని అన్నారు. ఏపికి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించేందుకే తానే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ కోసం నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు అనర్హత వేటు వేయిస్తారేమోనని ఇంత కాలం ఎదురుచూశాననీ, తనపై అనర్హత వేటు వేయించలేకపోతున్న వారిని చూసి శక్తివిహీనులని అర్ధం అయిపోయి తనకే జాలి వేసిందన్నారు.
Breaking: సమయం ఇచ్చా చేయలేకపోయారు
తానే రాజీనామా చేసి ఫ్రెష్ గా ఎన్నికలకు వెళ్లి ఈ రోజు ప్రజల్లో పార్టీని ప్రజలు ఎంతగా అసహ్యించుకుంటున్నారు అనేది ప్రూ చేద్దామన్న ఆలోచన ఉందని తెలిపారు. వాళ్లకు ఎన్ని రోజుల్లో అనర్హత వేటు వేయిస్తారో చెప్పండి అంటూ సవాల్ చేసినా సమాధానం రాలేదని అన్నారు. అందుకే క్విట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇంకా రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉంటానని ఇంత సమయంలో అనర్హత వేటు వేయిస్తామని వచ్చి చెప్పవచ్చని అన్నారు. అనర్హత వేటు వేయించడం మావల్ల కాదు అని చెప్పేస్తే వెంటనే రాజీనామా చేస్తానన్నారు. వాళ్ల సరదా తీర్చేందుకైనా ప్రజల సంపూర్ణ సహకారంతో, ఈ ప్రభుత్వ విధానాలను ధ్వేషించే అన్ని పార్టీల సహకారంతో ఈ ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా చేయడం కోసం తాను త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు రఘురామ. తాను తీసుకునే ఈ నిర్ణయం అమరావతే రాజధానిగా ఉండటం కోసమని తెలిపారు.