Rashmika: రష్మిక మందన్నా ప్రస్తుతం `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమా ప్రమోషన్స్లో మస్తు బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రాధికా శరత్ కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కీలక పాత్రలను పోషించగా.. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 4న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక ప్రమోషన్స్లో భాగంగా ఓ ప్రెస్ మీట్లో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్న రష్మిక.. తనకు వచ్చే జన్మలో మగ పిల్లాడిలా పుట్టాలనుందంటూ మనసులో ఉన్న వింత కోరికను ఏ మాత్రం సిగ్గు పడకుండా బయట పెట్టేసింది.
అయితే ఓ కోరిక వెనక ఓ కారణం కూడా చెప్పుకొచ్చిందామె. `ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీలో పెళ్లి చూపుల కారణంగా అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడతారో తెలుసుకున్నా. ఇష్టం ఉన్నా లేకున్నా అందంగా అలకరించుకుని అబ్బాయి, వాళ్ల బంధువులు ముందు తల వంచుకుని కూర్చోవాలి.
ఆ బాధలు చూశాక వచ్చే జన్మలో అయినా మగవాడిగా పుట్టాలని కోరుకుంటున్నాను` అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. కాగా, తెలుగుతో వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక.. త్వరలోనే `మిషన్ మజ్ను` బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. అలాగే హిందీలో గుడ్బై అనే మరో మూవీలోనూ నటిస్తోంది.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!