Radhe Shyam: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధేశ్యాం” ఈనెల 11న విడుదల అయ్యి డిజాస్టర్ కావడం తెలిసిందే. పూజా హెగ్డే తో ఫస్ట్ టైం ప్రభాస్ నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న గా.. వాటిని అందుకోలేక పోవడం జరిగింది. ఫ్యాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ప్రతి చోట మిక్సిడ్ టాక్ సొంతం చేసుకునీ… సమ్మర్ రేసులో మొదటి రిలీజ్ అయ్యే డిజాస్టర్ సినిమాగా నిలిచింది. బాహుబలి తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో “సాహో”.. ప్లాపు కావడంతో పాటు మళ్లీ ఇప్పుడు “రాధేశ్యాం” పరాజయం పాలు కావడంతో… ప్రభాస్ అభిమానులు ఫుల్ నిరుత్సాహంగా ఉన్నారు.
అంతేకాకుండా ఏపీలో ఒక అభిమాని అయితే సినిమా ప్లాప్ అయింది అని.. ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కాకముందే “రాధేశ్యాం” కి సంబంధించి ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. ఆటల్లో కి వెళ్తే త్వరలోనే “రాధేశ్యాం” ఓటిటి లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ఓటిటి సంస్థ భారీ ధరకు.. ఈ సినిమాని కొనుగోలు చేసినట్లు ఫిలిం నగర్ టాక్.
ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది పండుగ సందర్భంగా.. అమెజాన్ లో…”రాధేశ్యాం” స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. లేకపోతే ఏప్రిల్ 11 వ తారీకు అయినా ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ చేయనున్నట్లు.. వార్తలు వస్తున్నాయి. మరి నిజం ఎంతో అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన “రాధేశ్యాం”.. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు రాధాకృష్ణ పనితనం… సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. సో సినిమా చివరాకరికి డిజాస్టర్ గా నిలిచింది. దీంతో లాంగ్ లాంగ్ గ్యాప్ లో భారీ పరాజయాలు రావటం.. డార్లింగ్ అభిమానులకు మరింత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!