Mahesh: సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. కరోనా వేవ్స్ లేకపోయి ఉంటే ఈ పాటికి సర్కారు వారి పాట సినిమా కాకుండా మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ, అలా కాకుండా మహేశ్ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. గత 5 ఏళ్ళుగా మహేశ్ వరుస హిట్స్తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ వస్తున్నారు. గత చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దాంతో ఇప్పుడు తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా మీద భారీ అంచనాలున్నాయి.
అయితే, అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దానికి తోడు దుబాయ్, స్పేయిన్, అమెరికాతో పాటు గోవా, హైదరాబాద్లలో చిత్రీకరణ జరిపారు. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇది యూనివర్సల్ పాయింట్ కావడంతో పరశురామ్ హాలీవుడ్ రేంజ్లో స్టైలిష్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మహేశ్ బాబు సరసన హీరోయిన్గా నటిస్తోంది.
Mahesh: బ్రేకీవెన్ విషయంలో మాత్రం కాస్త కంగారు పడుతున్నారట.
అయితే, ఈ సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కంటే బాగానే ఎక్కువ ఖర్చు చేశారట. కరోనా వేవ్స్ అలాగే, పలు విదేశాలలో షూటింగ్ జరపడం వల్ల అనుకున్న దానికంటే బడ్జెట్ బాగానే ఎక్కువైనట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అయితే, మహేశ్ మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు కావడంతో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చే వరకు మేకర్స్ కాస్త టెన్షన్గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తైంది. కాబట్టి, అంతగా టెన్షన్ పడకపోయినా కూడా బ్రేకీవెన్ విషయంలో మాత్రం కాస్త కంగారు పడుతున్నారట.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!