Rashmika: `ఛలో`తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన కన్నడ సోయగం రష్మిక మందన్నా.. తొలి ప్రయోగంలోనే హిట్ను అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈమె నటించిన `గీత గోవిందం` సైతం మంచి విజయం సాధించడంతో.. రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారింది.
ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఇకపోతే రష్మిక వరుస సినిమాలను టేకప్ చేయడమే కాదు.. కొన్ని ప్రాజెక్ట్స్ను రిజెక్ట్ కూడా చేసింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు వదిలేసింది. మరి ఆ సినిమాలు ఏవేవో ఓ లుక్కేసేయండి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆచార్య`. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. అయితే చరణ్ సరసన నటించాలని రష్మికను సంప్రదించగా.. ఆమె నో చెప్పిందట. దాంతో ఆమె స్థానంలో పూజా హెగ్డేను ఎంపిక చేశారు. అలాగే దళపతి విజయ్- వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా మొదట రష్మికనే అడిగారట. కానీ, ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా ఆమె రిజెక్ట్ చేసిందట.
విజయ్ హీరోగా నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `బీస్ట్` వంటి పాన్ ఇండియా మూవీ నుంచీ రష్మికకు ఆఫర్ వచ్చిందట. రెమ్యునరేషన్ కారణంగా బీస్ట్ను సైతం వదిలేసిందట. ఇక ఈ మధ్య రణబీర్ కపూర్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న ‘యానిమల్’ లో కూడా ఈమెను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో.. రష్మిక యానిమల్కు నో చెప్పిందని తాజా టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!