Renu Desai: ఒకప్పటి హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో జన్మించిన రేణు.. తమిళంలో తెరకెక్కిన `జేమ్స్ పాండు` చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `బద్రి`లో పవన్ కళ్యాణ్ సరసన నటించింది.
ఈ సినిమా సమయంలో పవన్, రేణు దేశాయ్ల మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమ, పెళ్లి వరకు వెళ్లింది. కానీ, ఇద్దరు పిల్లులు పుట్టిన అనంతరం వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి పిల్లలను చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న రేణు.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంతో రూపొందుతున్న తాజా చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా.. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రను పోషిస్తోంది.
హైదరాబాద్లోని నోవాటెల్లో గ్రాండ్గా ఈ మూవీ ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ లుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్లో రేణు రీఎంట్రీపై మాట్లాడుతూ.. `దర్శకుడు వంశీ ఈ సినిమా కథలోని పాత్ర గురించి చెప్పారు. ఆ సమయంలో తెరపై కనిపించాలనే ఆలోచనలేదు. కానీ పాత్ర చాలా బాగుండటంతో టెమ్ట్ అయిపోయాను. అందుకే ఓకే చెప్పా. ఈ చిత్రంలో నా పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇండియాలో గొప్ప దర్శకుడిగా వంశీ పేరు తెచ్చుకుంటాడనే నమ్మకముంది` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ వైరల్గా మారాయి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!