Diabetes: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. వాటిలో డయాబెటిస్ కూడా ఒకటి.. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం ను ఎక్కువ మందిలో చూస్తున్నాం.. ఈ ఆరోగ్య సమస్య రావడానికి కూడా ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం.. ఎటువంటి ఆహారాలు మన డైట్ లో ఉంటే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..!
షుగర్ తో బాధపడుతున్న వారు పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. ఈ పిండి పదార్థాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సాధ్యమైనంతవరకు వీటిని తినడం తగ్గించాలి. ఉదయం అల్పాహారంలో ఏదైనా కూరగాయల జ్యూస్ తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో కూరగాయల సాలాడ్, రాత్రి ఫ్రూట్స్ ను తీసుకోవాలి. ఇలా చేస్తే మీరు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోలేరు. దీంతో ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
డయాబెటిస్ పేషెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందువలన రైస్ తీసుకోవడం తగ్గించి చిరుధాన్యాలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, ఉదలు వంటి చిరుధాన్యాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. గ్రీన్ టీ తాగినా కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. రోజు భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నడిచినా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతాయి.