Puri Jagannath: టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా పాపులర్ అయిన పూరి జగన్నాథ్ ఓ సినిమా చేస్తున్నాడంటే డెఫినెట్గా అది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఇక పూరి సినిమా ఫ్లాపయినా జనాలు కనీసం ఒక్కసారైనా చూసేంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తన సినిమా ఫ్లాపయినా హీరోలకు కావాల్సిన మాస్ ఇమేజ్ ఇస్తాడు. హీరోయిన్స్కు రావాల్సిన గ్లామర్ బ్యూటీ క్రేజ్ తెచ్చిపెడతాడు. పూరి కెరీర్లో తీసిన ప్రతి సినిమాలో అన్ని అంశాలు పుష్కలంగా ఉంటాయి.
ఎలాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్కు కావాల్సిన సెంటిమెంట్ సీన్స్ ఖచ్చితంగా ఉంటాయి. తల్లి – కొడుకు, తండ్రి – కొడుకు సెంటిమెంట్స్..హీరో – హీరోయిన్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అయితే, తాజాగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్..గతంలో ఆయన తీసిన సినిమా కథ మాదిరిగానే ఉండబోతుందా..ఇదే కథకు ముంబై నేపథ్యాన్ని, పాత్ర లను తారుమారు చేశాడా..? ఇలాంటి కొత్త సందేహాలు చాలానే వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం కథా నేపథ్యం సరిగ్గా సూటవడమే.
Puri Jagannath: పాత కథనే మళ్ళీ పూరి చూపిస్తే..?
మాస్ మహారాజ రవితేజ హీరోగా ఆసిన్ను హీరోయిన్గా పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన సినిమా అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి. ఇది కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే, దీనిని లోకల్ కథగా చూపించాడు. దీనిలో సెంటిమెంట్స్ బాగానే ఉంటాయి. ముఖ్యంగా తండ్రి – కొడుకుల మధ్య వచ్చే సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే, లైగర్ సినిమాలో కూడా కథా నేపథ్యం బాక్సింగే. ఇందులో ఇంటర్నేషనల్ స్థాయిలో కథ నడిపించినట్టు అందుకే దాదాపు కథ పాతదే అయినా మైక్ టైసన్ లాంటి ఇంటర్నేషనల్ బాక్సర్ను తీసుకున్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ పాత కథనే మళ్ళీ పూరి చూపిస్తే మనవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.