Manchu Vishnu: ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు విష్ణును హాట్ బ్యూటీలైన పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ లు చితకబాదేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగింది..? విష్ణును పాయల్-సన్నీలు ఎందుకు కొట్టారు..? అన్నది తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
మంచు విష్ణు ప్రస్తుతం మంచు విష్ణు ప్రస్తుతం ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో `గాలి నాగేశ్వరరావు` అనే మాస్ పాత్రలో విష్ణు కనిపించబోతుండగా.. పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కోన వెంకట్ వ్యవహరిస్తుంగా.. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత కొద్ది రోజుల నుంచీ సినిమా షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతోంది. అయితే షూటింగ్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు మంచు విష్ణు సన్నీ లియోన్తో కలిసి ఫన్నీ వీడియో చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. అయితే ఆ సారి విష్ణు సన్నీతో పాటు పాయల్ను కూడా ఓ ఆట ఆడుకుందామని అనుకున్నారు. కానీ, ప్లాన్ రివర్స్ అయ్యి అడ్డంగా బుక్కైయ్యాడు.
అసలేమైందంటే.. సన్నీ లియోన్-పాయల్ రాజ్పుత్ లలో ఎవరు మీ ఫేవరెట్? అని విష్ణును పశ్రించగా… సన్నీ లియోన్ పక్కన ఉన్నప్పుడు సన్నీ అని, పాయల్ పక్కన ఉన్నప్పుడు ఆమె అని చెప్పి ఇద్దరినీ మేనేజ్ చేశాడు. అయితే సన్నీ- పాయల్ ఇద్దరూ పక్క పక్కన ఉన్నప్పుడు `ఎవరు అంటే ఇషం?` అనే ప్రశ్న విష్ణు ఎదురైంది. అయితే ఆ టైమ్లో కాస్త ఆలోచించిన విష్ణు.. టక్కున అలియా భట్ అని అనేశాడు. దాంతో పక్కన ఉన్న పాయిల్, సన్నీలు విష్ణును పరిగెత్తించి పరిగెత్తించి కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!