Breaking: ఏపీలో నేడు ప్రకటించాల్సి ఉన్న పదవ తరగతి పరీక్ష ఫలితాలను వాయిదా వేశారు. ఈరోజు 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ టెన్త్ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తారని ముందుగా ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పరీక్ష ఫలితాల వెల్లడి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
Read more: YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?
Breaking: సోమవారం టెన్త్ ఫలితాలు
సోమవారం ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. అనివార్య కారణాల వల్ల నేడు టెన్త్ పరీక్ష ఫలితాలను వెల్లడించ లేక పోతున్నట్టు తెలిపారు.