ఆదిత్య ఎక్కడ దేవికి దగ్గరవుతాడో.. దేవిని తనతో పాటు తీసుకువెళ్తే రాధా తన ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతుందో.. అని భయంతో మాధవ్ తన మైండ్లో మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేస్తాడు.. సత్య చూసేలా మాధవ్ తన బాధను చిన్మయికి చెబుతాడు.. అప్పుడే సత్య వచ్చి ఏమైంది బావగారు అని అడుగుతుంది.. దేవి ఇంట్లో లేకపోతే నేను ఎలా ఉండగలను.. నా కూతురు నా ఇంట్లో నుంచి బోనం ఎత్తాలి అని అనుకున్నాను.. పండగపూట నా కూతురు నా ఇంట్లో లేకుండా చేశాడు ఆదిత్య అంటూ.. తన బాధను సత్యతో చెబుతాడు.. సత్య ఎలాగైనా దేవి మీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను అని మాధవ్ కి మాట ఇస్తుంది సత్య..
ఆదిత్య దేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సత్య వచ్చి దేవిని వాళ్ళింటికి పంపించేయమని చెబుతుంది. అప్పుడే దేవుడుమ్మ కూడా వస్తుంది. ఇప్పుడు ఏమైంది చేసి చెస్ టోర్నమెంట్ అయిన తర్వాత పంపిస్తారు కదా అని అంటుంది. ఎవరైనా పండగ పూట వాళ్ల బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉండాలి అనుకుంటారు.. కానీ దేవి మన ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అని చెబుతోంది సత్య. ఇక తనకు ఎదురు చెప్పిన ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతుంది సత్య. దేవి నేను మా ఇంటికి వెళ్తాను అని అంటుంది. ఆదిత్య ముందే దేవి మాధవ్ తో కలిసి వెళ్లడం చూసి చాలా బాధపడతాడు..
రుక్మిణీ ఏదో ఆలోచిస్తూ ఉండగా.. అక్కడికి మాధవ్ వస్తాడు.. నువ్వు చేసింది ఏం బాగోలేదు సారు అని రాధా అంటుంది మరి మీరిద్దరూ కలిసి దేవిని నాకు దూరం చేయాలి అని అనుకున్నారు కదా అని అంటాడు అంటే మేము మాట్లాడుకున్న మాటలు చాటుగా విన్నావా అని అడుగుతుంది రాదా? అవును అని అంటాడు మాధవ్..
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!