ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డివోర్స్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. విస్తుపోయే విషయం ఏమిటంటే… కొన్ని సెలబ్రిటీల జంటలు సినిమా ద్వారా ఫేమస్ కావడం కంటే విడాకులు తీసుకొనే ఎక్కువగా ఫేమస్ అయిపోతున్నాయి. వీరందరూ భారతీయ వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తూ అందర్నీ ఆగ్రహానికి గురి చేస్తున్నారు. వివాహ బంధంలో తలెత్తే మనస్పర్థలను పరిష్కరించడం కంటే వీరు డివోర్స్ తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ధనుష్, నాగచైతన్య వంటి వారే విడాకులు తీసుకోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఇంకో సెలబ్రిటీ జంట కూడా విడాకులకు సిద్ధమయ్యారు.
స్టార్ డైరెక్టర్
టాలీవుడ్లో ఆ ముగ్గురు హీరోలు మహా ఇష్టమంటున్న రెజీనా!
వాళ్లు మరెవరో కాదు.. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, అతని సతీమణి రూప. ఈ జంట తాము కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాలేకపోతున్నామని, అందుకే డివోర్స్ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా శ్రీను వైట్లకు అతని భార్యకు మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయట. ఆ గొడవలకు శాశ్వతంగా స్వస్తి చెప్పి హాయిగా సంసార జీవితం సాగించండి అని పెద్దలు కొన్నేళ్ల వరకు చెప్పుకొచ్చారు. వారు చెప్పిన మాటలతో కొద్దిరోజుల పాటు వీరు పెళ్లి జీవితం మంచిగానే సాగింది. మళ్లీ ఇప్పుడు వారి మధ్య కలతలు వచ్చాయి. దాంతో ఏకంగా కోర్ట్ నే ఆశ్రయించినట్లు వార్తలు వస్తున్నాయి.
రూప ఓ కాస్ట్యూమ్ డిజైనర్
గతంలో శ్రీనువైట్ల డైరెక్షన్ చేసిన సినిమాలకు అతని భార్య రూప కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసేది. ఇప్పుడు వారి మధ్య గొడవలు స్టార్ట్ అవడంతో గత 4 ఏళ్లుగా రూప విడిగా ఉంటుంది. వీరికి 2003లో వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రూప ఇటీవల నాంపల్లి కోర్టులో విడాకులకు అప్లై చేసినట్లు సినీ వర్గాల్లో టాక్. వెంకీ, ఢీ, దూకుడు సినిమాలతో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ గా మారారు. అతనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ విడాకుల వ్యవహారం గురించి తెలిసి వారు షాక్ అవుతున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!