బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వరుస అవకాశాలతో సమంత దూసుకుపోతోంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ కెరియర్ పరంగా స్పీడ్ పెంచింది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ ఇంకా ఐటెం సాంగ్ లతో దూసుకుపోతుంది. పుష్ప లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. “ఊ అంటావా” అనే మాస్ బిట్ కి సమంత వేసిన చిందులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సమంత అభిమానులకు గుడ్ న్యూస్..!!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ పాటకి ఫిదా అయిపోయారు. ప్రపంచ దేశాలలో చాలా కార్యక్రమాలలో ఈ పాట మారుమొగింది. సమంతకి ఎంతో క్రేజ్ తీసుకొచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సమంతకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ముఖ్యఅతిథిగా సమంతకి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ఇటీవల వెల్లడించింది. ఆగస్టు 12వ తారీకు ఈ ఫెస్టివల్ మొదలు కానుంది.
ఈ క్రమంలో సమంత తన కెరియర్ గురించి నటన పరిశ్రమతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకోనుంది. భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ముఖ్యఅతిథిగా నాకు ఆహ్వానం అందటం చాలా గర్వంగా ఉందని.. ఈ సందర్భాన్ని ఉద్దేశించి సమంత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికోసమే ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత తెలుగులో విజయ్ దేవరకొండ తో శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” చేస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు గా యశోద, శకుంతలం ప్రాజెక్టులు చేస్తూ మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక ప్రాజెక్టులలో సమంత నటిస్తున్నట్లు సమాచారం.