బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో బోనాలు ఎత్తిన సౌందర్య కుటుంబం అమ్మవారిని చేరుకుని అక్కడ బోనం సమర్పిం పంతులు తమ మనసులోని కోరికలను పేపర్ మీద రాసి బిందెలో వేస్తూ ఉంటారు. అదే సీన్ నేటి ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది.నా మనవరాళ్లు, మనవళ్లు అంతా సంతోషంగా ఉండాలి.హిమ, సౌర్య కలిసిపోవాలి అని ఆనందరావు,సౌందర్య తమ కోరికలు రాసి బిందెలో వేస్తారు. తర్వాత వెళ్లిన హిమ ఏమో ‘సౌర్యకి బావకి పెళ్లి కావాలి’అని రాస్తుంది. ఇక సౌర్య ఏం రాస్తుందో,తన మనసులో కోరిక ఏంటో తెలుసుకోవాలి అని తను రాయబోయే పేపర్కి గుర్తుగా చుక్క పెడదాం అనుకుని వెళ్లి స్టార్ గుర్తు పెడుతుంది హిమ.
సౌర్య రాసిన లెటర్ చూసి షాక్ అయిన హిమ :
హిమ వచ్చాక ‘సౌర్యా వెళ్లు అంటుంది సౌందర్య. ‘నాకు ఏ కోరికలు లేవు నాన్నమ్మా అన్నీ ఆవిరి అయిపోయాయి’ అంటూ నిరుపమ్ వైపు చూస్తుంది. కాదు కాదు కొందరు ఆవిరి చేశారంటే కరెక్టేమో’ అంటు హిమని గుర్రగా చూస్తూ అంటుంది.‘అదేంటమ్మా అలా అనుకోకు ఏమో. అమ్మవారు నీ కోరికే తీరుస్తుందేమో..ఎవరికి తెలుసు?’ అంటాడు ఆనందరావు. సరే అని చెప్పి వెళ్లి పేపర్ మీద తన కోరిక రాసి బిందెలో వేస్తుంది సౌర్య.తర్వాత నిరుపమ్ నాకు హిమకు ఆటకాలు లేకుండా పెళ్లి జరగాలి అని రాసి బిందెలో వేస్తే.. ప్రేమ్ కూడా అదే కోరుకుంటూ పేపర్ మీద రాసి బిందెలో వేస్తాడు. సీన్ కట్ చేస్తే నాన్నమ్మా నేను వెళ్తాను పూజ అంతా అయిపోయింది కదా?’ అంటుంది సౌర్య. ‘అయ్యో ఉండవే కాసేపు గుడిలో కూర్చుని వెళ్లాలి అంటూ అందరిని గుడిలోకి తీసుకుని వెళ్తుంది సౌందర్య. మరో పక్క హిమ బిందెలో వెతికి సౌర్య రాసిన పేపర్ని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ‘అమ్మా నాన్నా రావాలి’ అని ఉంటుంది అందులో. హిమ కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి.
హిమను కొట్టడానికి చేయి ఎత్తిన సౌర్య:
వెంటనే కారు దగ్గరకు వెళ్తున్న సౌర్య దగ్గరకు పరుగుతీస్తుంది హిమ. ‘సౌర్యా అని అనగానే హా.. ఏం రాసి వేశాను అంటావా? లేక నువ్వేం రాశావో చెబుతావా? నేను చెప్పను.. నువ్వు చెప్పేది వినను. వెళ్లు అవతలకి’ అంటుంది కోపంగా అరుస్తూ. హిమ మాత్రం సౌర్యా ఏది ఏమైనా నిరుపమ్ బావతోనే నీ పెళ్లి జరుగుతుంది’ అంటుంది. ‘హేయ్’ అని చేయి ఎత్తి హిమని కొట్టబోయి ఆగుతుంది సౌర్య. విను నీ నిరుపమ్ బావ వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నా వద్దు అనే అంటాను వినిపించిందా? వెళ్లు ఇక్కడ నుండి నువ్వు నీ నాటకాలు నీలా నేను మాట మార్చేదాన్ని కాదు’ అని అక్కడ నుంచి కోపంగా వెళ్తుంది సౌర్య.
సౌందర్య, ఆనందరావుల ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిద్దా..?
ఇక సీన్ కట్ చేస్తే.. సౌందర్య, ఆనందరావులు ఇద్దరు మానవరాళ్లను ఇంట్లోనే ఉంచేలాగా ప్లాన్ చేసి సౌర్య ఆటోకి టైర్ పంచర్ చేస్తారు.ఇక ఆనందరావుకు ఆరోగ్యం బాలేదని డ్రామా ఆడి హిమని ఆసుపత్రికి వెళ్లకుండా చేద్దాం.. అప్పుడు ఇద్దరూ ఇంట్లో ఉంటారు అటుంది సౌందర్య.సరే అంటాడు ఆనందరావు.సౌర్య అటుగా వస్తుంది. దాంతో సౌందర్య, ఆనందరావులు కారు వైపు వెళ్లిపోయి దాక్కుంటారు. సౌర్య ఆటో ఎక్కి స్టార్ట్ చేసి.. వెనుక గాలి లేదని గ్రహిస్తుంది. ‘దేవుడా.. పంచర్ అయ్యిందా?’అనుకుంటూ ఉండగా.. ఆనందరావు, సౌందర్యలు ఏం తెలియనట్లుగా వచ్చి.. ‘ఏం అయ్యింది?’ అంటారు.పంచర్ అయినట్లుఉంది’అని సమాధానం ఇస్తూనే ఫోన్ తీసుకుని సుమతికి కాల్ చేసి టైర్ పంచర్ అయింది గాని స్టెఫినీ పంపించు’ అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది.
నిరూపమ్ తో బయటకు వెళ్ళబోతున్న శోభ :
ఇక ప్రేమ్తో స్పప్న మాట్లాడుతూ ఉండగా శోభ వచ్చి నిరుపమ్ ఉన్నాడా ఆంటీ?’అంటే పైన ఉన్నాడని చెప్పగానే నిరుపమ్ దగ్గరకు వెళ్లిన శోభ నా మూడ్ ఏమి బాలేదు నిరుపమ్ రా అలా బయటికి వెళ్దాం’ అంటూ రిక్వస్ట్ చేస్తుంది. నిరుపమ్ సరేనంటూ శోభతో పాటు వెళ్లడానికి సిద్ధపడతాడు. వెంటనే శోభ మనసులో ఎలా అయినా ‘హిమ మీద ప్రేమ తగ్గేందుకు నాలుగు మాటలు చెప్పి నిరుపమ్ ను నాకు దగ్గర చేసుకోవాలి’ అని అనుకుంటుంది.అయితే సీరియల్ లో కి మళ్ళీ కార్తీక్, దీపలు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా.. అనే సందేహం అయితే అందరిలోనూ మెదులుతుంది
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!