ఏపిలో ఈ తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. లారీని ఓ కారు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదంలో పల్నాడు జిల్లా వాసులు మృతి చెందారు. పల్నాడు జిల్లా మాచర్ల నుండి తిరుపతి వైపు వెళుతున్న కారు కంభం సమీపంలో ఓ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన వాహాన్ని తప్పించి ట్రాఫిక్ క్లీయర్ చేశారు.
కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుుటుంబానికి చెందిన అయిదుగురు మృతి చెందడంతో వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో విషాదశ్చాయలు అలుముకున్నారు.