మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే `రంగ రంగ వైభవంగా` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. `అర్జున్ రెడ్డి` సినిమాను తమిళంలో రీమేక్ చేసి సక్సెస్ అయిన డైరెక్టర్ గిరీశాయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో `రొమాంటిక్` బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా అలరించబోతోంది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఇదో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ కు `మల్టీ స్టారర్ మూవీని ఎవరితో చేయడానికి ఇష్టపడతారు..?` అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన బదులిస్తూ.. `మల్టీ స్టారర్ లో నేను ఒక నటుడిగా చేయాలనుకోవడం లేదు. మల్టీ స్టారర్ సినిమాను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను.
మా అన్నయ్య సాయితేజ్ .. మా బావ వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ చేయాలనుంది. ఆల్రెడీ కథను కూడా రెడీ చేసుకున్నాను. అయితే ఆ మల్టీ స్టారర్ ను ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. త్వరలోనే అందుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తాను` అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో వైష్ణవ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!