ప్రస్తుతం నిర్మాతలకు కోట్లు ఖర్చు చేసి సినిమా తీయడం అనేది కామన్ అయిపోయింది. కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి మాత్రం నానా తిప్పలు పడుతున్నారు. వేరే సినిమాతో పోటీ పడకూడదని ఎంత ప్రయత్నించినా సరే ఒక్కోసారి పోటీ పడక తప్పడం లేదు. దీనివల్ల ఓపెనింగ్ కలెక్షన్స్తో పాటు, రన్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతున్నాయి. కొందరు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కథని నమ్ముకొని సినిమాలు విడుదల చేస్తున్నారు. అలా ఈనెల 23న టాలీవుడ్లో ఒకేసారి చాలా మంది దర్శకులు తమ సినిమాలను విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ కుర్ర హీరోలు బాక్సాఫీస్ ముందు ఒకేరోజు హల్చల్ చేయబోతున్నారు.
ఒకేసారి నాలుగు సినిమాలు
నాగ శౌర్య నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుంది కానీ కొన్ని కారణాలతో పోస్టు పోన్ అవుతూ వచ్చింది. ఈనెల 23వ ముహూర్తం బాగుండడంతో ఆరోజే సినిమాను రిలీజ్ చెయ్యనున్నారు. పోలీస్ ఆఫీసర్ గా శ్రీ విష్ణు నటించిన ‘అల్లూరి’ సినిమాకి కూడా అదే రోజు ముహూర్తం ఫిక్స్ చేసారు. అల్లూరి సినిమా నిర్మాత బెక్కం వేణుగోపాల్ ప్రెస్ మీటింగ్కి కూడా పోలీస్ దుస్తులలో రావడం చూస్తుంటే అతని నెక్స్ట్ సినిమాలకు ఇంకేంత వెరైటీగా ప్రమోషన్స్ చేస్తాడో అనిపిస్తుంది.
హిట్ కొట్టేదెవరు
‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితుడైన సింహ కోడూరి ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాతో అలరించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్ వంటి పెద్ద సంస్థ అండ ఉంది కాబట్టి పబ్లిసిటీ గురించి కాస్త ఆలోచిస్తే కలెక్షన్స్ భారీగా ఉంటాయి. అలా అని కథ బాగోకపోయినా చూస్తారు అనుకోకండి. ఇదిలా ఉండగా కన్నడలో సూపర్ హిట్ని రీమేక్ చేసిన ‘గుర్తుందా సీతకాలం’ సినిమా ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. సత్యాదేవ్, తమన్నా ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ నెల 23న రిలీజ్ అయ్యే సినిమాల హీరోలకి అంతగా క్రేజ్ లేకపోయినా, ఎవరి సినిమాపై వారు మంచి నమ్మకంతో ఉన్నారు. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుని సంతృప్తి పరుస్తామనే నమ్మకంతో ఉన్నారు. వీటిలో ఏ సినిమా ప్రేక్షకులతో సూపర్ అనిపించుకుంటుందో చూడాలిక.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!