Rashmika Mandana: గత ఏడాది “పుష్ప” విజయంతో రష్మిక మందన మంచి జోరు మీద ఉంది. “పుష్ప” ప్రపంచ స్థాయిలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెకండ్ పార్ట్ మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో పలికిన డైలాగులు స్టెప్పులు ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ప్రముఖ సెలబ్రిటీలు, క్రీడాకారులు ఇంకా రాజకీయ నాయకులు ఇండియాలోనే కాదు ఇతర దేశాలకు చెందిన వాళ్లు.. “పుష్ప” హావభావాలు పలుకుతూ సోషల్ మీడియాలో సందడి చేశారు.
ఇటువంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందనకి.. దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ లభించింది. సినీ కెరియర్ కన్నడ ఇండస్ట్రీలో ప్రారంభించిన గాని తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది. “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక “గీతాగోవిందం” సినిమాతో యూత్ లో తిరుగులేని క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకేవరు” ఆఫర్ అందుకొని.. బ్లాక్ బస్టర్ అందుకుని మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ రకంగా దూసుకుపోతున్న రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ తో ఇటీవల “గుడ్ బై” అనే సినిమా చేయడం జరిగింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రష్మిక మందన..నిజ జీవితంలో ప్రేమ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. “నా స్నేహితుల అదేవిధంగా కుటుంబ సభ్యులు నేను అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు. రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో చాలా టైం ఇవ్వాలి. చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ప్రస్తుతం నేను సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నాకు అసలు టైం ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతాను అంటూ.. రష్మిక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.