Deepavali: ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే దీపావళి పండగను ప్రజలు అందరు ఎంతో ఘనంగా చేసుకుంటారు..దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా కూడా జరుపుకుంటారు. అయితే దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారో అనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి దీపం అంటే కేవలం నూనెతో వత్తిని వెలిగించడమే కాదు.దీపం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమని,త్రిమూర్తులకు ప్రతీక అని భావించాలి.
కొవ్వొత్తి కన్నా మట్టి ప్రమీదే మంచిదా..?
మట్టి ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించాలి.మట్టి ప్రమీద మన మనసును సూచిస్తుంది. ఆ ప్రమిదలో పోసే నూనె మన భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఆ నూనెలో వేసే వత్తి ఆత్మ అవుతుంది.ఆ వత్తిని వెలిగించడం ద్వారా ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. అప్పుడు దైవసాక్షాత్కారం లభిస్తుంది.ఇలా దీపారాధన వెనుక ఒక దివ్యమైన పరమార్థం దాగుంది.అలాగే దీపావళి పర్వదినాన వెలిగించే దీపాలు మనసులోని చీకటి కోరికలు, ఆలోచనలన్నింటినీ నాశనం చేస్తాయని నమ్ముతారు. అలాగే శత్రు భయం కూడా తొలగిపోతుంది. ఈరోజున వెలిగించే దీపాలతో పుణ్యప్రాప్తి లభిస్తుంది.
టపాకాయలు పెలవడం వలన ఉపయోగాలు :
అలాగే ఈ పండగ పర్వదినాన కాల్చే టపాకాయలు వలన కూడా మనకు చాలా ఉపయోగాలు కలుగుతాయి. ఈ దీపావళి రోజున పాము బిళ్లలు కాల్చడం వల్ల శరదృతువులో వచ్చే సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి.అలాగే బాణాసంచా కాల్చినప్పుడు వచ్చే పొగ పీల్చడం వల్ల కడుపులో నులి పురుగులు చచ్చిపోతాయి.అలాగే దోమలు కూడా తగ్గి విషజ్వరాలు రావు.భూచక్రాల వల్ల నేలపై ఉన్న సూక్ష్మక్రిములు చనిపోతాయి.