Chiranjeevi: ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర రంగానికి ప్రాధాన్యత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తూ ఉంది. తెలుగు సినిమాలకు బాలీవుడ్ సినిమాలు సైతం పోటీ ఇవ్వలేని పరిస్థితి గత కొన్ని సంవత్సరాల నుండి నెలకొంది. దీంతో బాహుబలి, RRR, పుష్ప సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. అనేక దేశాలలో టాలీవుడ్ సినిమాలకు గిరాకీ పెరిగింది. ఇటువంటి తరుణంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు.
వీరిద్దరి భేటీలో యూకే ప్రభుత్వం తెలుగు సినిమా రంగానికి సహకారం అందించే విషయంలో చర్చలు జరిగినట్లు..గారెత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా కరోనా కష్ట కాలంలో చిరంజీవి నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను తెలుసుకొని ఆయనను అభినందించారు. దీంతో గారెత్ విన్ ఓవెన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు నిత్యవసర సరుకులతో పాటు కరోనా వ్యాక్సిన్ లు ఉచితంగా వేయించడం జరిగింది.
కరోనా క్రైసిస్ చారిటీ (CCC) పెట్టి చాలామంది టాప్ హీరోల దగ్గర విరాళాలు సేకరించి… అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా తన సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు కూడా పలు జిల్లాలకు చిరంజీవి అప్పట్లో పంపించడం జరిగింది. ఇంకా ఇదే సమయంలో ఇటీవల సినీ కార్మికులకు తన తండ్రి పేరిట ఒక హాస్పిటల్ కూడా కట్టనున్నట్లు … ఉచితంగా వైద్యం అందించడానికి రెడీ అవుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో వీటన్నిటి గురించి చర్చ జరిగినట్లు దీంతో చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అభినందించడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!