Suneetha: సింగర్ సునీత ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు.. హీరోయిన్లకు ఉన్న క్రేజ్ ఈమె సొంతం. సునీత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా సునీత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టుకు ఓ ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసింది.
సింగర్ సునీత పాట పాడుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. మై హ్యాపీ స్పేస్ అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది.. ఒక హ్యాపీ సింబల్ కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీ పోస్ట్ కోసమే ఎదురు చూస్తున్న మేడం అంటూ కొంతమంది.. మరి కొంతమంది మీ పాటలకి పరవశించి పోతున్నాము అంటూ మరికొంతమంది రకరకాలుగా ఈ పోస్ట్ కి స్పందిస్తున్నారు.
సునీతకు గులాబీ, ఎగిరే పావురమా వంటి సినిమాల్లో పాడిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.. సునీత ఇప్పటి వరకు దాదాపుగా 500 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. సునీతకు శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావ్ అనే పాట సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. సునీత తెలుగు తో పాటు తమిళ ,మలయాళ, కన్నడ భాషలలో కూడా 3,000 సినిమాలకు పాటలు పాడారు.. నిజం చెప్పాలంటే తెలుగులో చాలామంది సింగర్స్ కి లేని ఇమేజ్ సునీత సొంతం పాటలు పాడిన పాడకపోయినా కూడా తన అందంతోనే ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది సునీత.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!