Buchi Babu: “ఉప్పెన” సినిమాతో డైరెక్టర్ బుచ్చిబాబు మంచి పేరు సంపాదించుకోవడం తెలిసిందే. మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే “ఉప్పెన” హిట్ అయ్యి చాలా కాలం అయినా గాని రెండో సినిమాకి బుచ్చిబాబు నానా తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలో తారక్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయినట్లు మొన్నటిదాకా వార్తలు రావడం జరిగింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తీయడానికి రెడీ అయినట్లు కూడా ప్రచారం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ తన కెరియర్ లో 30వ సినిమా.. కొరటాలతో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ … కొరటాల ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి టైం పట్టే అవకాశం ఉండటంతో.. బుచ్చిబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ని పక్కన పెట్టి చరణ్ తో కలసి సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ కి ఓ స్టోరీ వినిపించినట్లు…ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.
అయితే ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వేరేలవుతున్నాయి. “RRR”తో పాన్ ఇండియా లెవెల్ లో చరణ్ కి మార్కెట్ ఏర్పడడంతో పాన్ ఇండియా నేపథ్యంలోనే చేయటానికి బుచ్చిబాబు స్క్రిప్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాని కొత్త బ్యానర్ లో సతీష్ కిలారు అనే వ్యక్తి నిర్మించనున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!