SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాల్సి ఉండగా… సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది. మరోపక్క సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే కాలి ఫ్రాక్చర్ ఇంకా నాయం కాలేదు. కానీ అంతకుముందు ఈ సినిమా ఏప్రిల్ 28వ తారీకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. కానీ ప్రజెంట్ పరిస్థితి చూస్తే పూజ హెగ్డే ఇంకా కోలుకోకపోవడంతో… షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొందట.
మహేష్ కూడా తన కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో… డిప్రెషన్ లో ఉన్నట్లు.. వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ లో పూజా హెగ్డే జాయిన్ కానుందని.. చిత్ర యూనిట్ అప్పట్లో తెలిపింది. కానీ ప్రజెంట్ పరిస్థితి చూస్తే ..పూజ కోలుకోవడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉండటంతో.. సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కష్టమని సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేసే రీతిలో.. సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా స్టార్ట్ చేసిన నాటి నుండి… అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి.
మరోపక్క చూస్తే రాజమౌళి సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి మహేష్ ఒకేసారి ఈ రెండు సినిమా షూటింగ్లలో పాల్గొంటాడా లేకపోతే త్రివిక్రమ్ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ గతంలో అతడు, కాలేజా సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలలో కూడా త్రివేక్ర మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. మరి వస్తున్న మూడో సినిమాలో మహేష్ బాబుని ఏ కోణంలో త్రివిక్రమ్ చూపిస్తున్నాడో అనేది అభిమానులలో… ఆసక్తి పెంచుతుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!