Intinti Gruhalakshmi: సామ్రాట్ తులసి ఇద్దరూ గుడికి వెళ్తారు. గుడిలో ఇద్దరు కలిసి ముడుపులు కడుతూ ఉంటారు. మీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి తులసి గారు అని సామ్రాట్ అంటాడు. సరే అని నవ్వుతూ తులసి సామ్రాట్ ఇద్దరు చెట్టుకి ముడుపులు కడతారు. నేను హని కోసం ముడుపు కడుతున్నను తులసి గారు.. మీరు ఏం కోరిక కోరుకున్నారు అని సామ్రాట్ అడుగుతాడు.. కోరిక ఏంటి అనేది చెప్పకూడదని అది నెరవేరాక అందరికీ తెలుస్తుంది అని తులసి ఉంటుంది.
సామ్రాట్ తులసి ఇద్దరూ కలిసి చెట్టుకు ముడుపు కట్టి కారులో కూర్చుంటాడు. హనీకి కుంకుమ తీసుకురావడం మర్చిపోయాను అని సామ్రాట్ తులసి ఆ ముడుపులో ఏం కోరిక రాసిందో తెలుసుకోవాలని ఆ చెట్టు దగ్గరకు వెళ్తాడు.
శృతి ఎందుకు అదోలా ఉన్నావ్ అని ప్రేమ్ అడుగుతాడు. లాస్య నీకు ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేంజ్ అవ్వట్లేదు అని చెబుతుంది. నేను ఒక చేతకాని భార్యను అని శృతి తనను తాను తిట్టుకుంటుంది.. ప్రేమ్ లాస్య మీద గొడవపడటానికి వెళ్తాడు. లాస్య కావాలని అంకుల్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇదంతా చేస్తుంది ప్రేమ్ అని శృతి ప్రేమ్ ని కంట్రోల్ చేస్తుంది. ప్రేమ్ కావాలని ఆన్లైన్లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడతాడు.
సామ్రాట్ మనసు ఉండబట్టలేక తులసి చెట్టుకు కట్టిన ముడుపును విప్పతీసి అందులో ఏం రాసిందో చూడాలని అనుకుంటాడు. ముడుపు విప్పి అందులో ఏం రాసుందో చదవాలని అనుకుంటాడు అప్పుడే తన వెనకమల పంతులు వచ్చి గొంతుతో సైగ చేస్తాడు. కట్టిన ముడుపు విప్పకూడదు. ఆ కోరిక ఏదైనా నేను నెరవేరుస్తానని సామ్రాట్ అంటాడు. తులసి ఆ ముడుపులో చిన్ననాటి ఇంటికి వెళ్ళాలని అక్కడ తన స్నేహితులతో ఆ ఇంట్లో ఆడుకోవాలని రాసుంటుంది. అది తప్పకుండా నెరవేరుస్తానని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మీ కోరిక ఏంటో చెప్పండి నేను తీర్చుతాను అని సామ్రాట్ అంటారు నా కోరిక అమ్మవారు మాత్రమే తీర్చాలి అని తులసి అంటుంది. ఈ సమయంలో మనల్ని అర్థం చేసుకునే వాళ్లే మన పక్కన ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అని తులసి అంటుంది. నేను మీ పక్కన ఉంటాను అని సామ్రాట్ భరోసా ఇస్తాడా ఇవ్వడా అనేది తర్వాయి భాగంలో చూద్దాం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!