Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కీ సరైన హిట్టు పడలేదు. “బాహుబలి 2” తర్వాత సాహు, రాధేశ్యం.. రెండు కూడా అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. పైగా ఈ రెండు సినిమాలకి దాదాపు నాలుగు సంవత్సరాలు షూటింగ్ టైం పట్టింది. ఫలితాలు వచ్చేసరికి మొదటి షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవటం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఇటువంటి సబ్జెక్టులను ప్రభాస్ ఎంచుకోకూడదని.. అభిమానుల సైతం ఎంతో అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ రెండు సబ్జెక్టులు “బాహుబలి 2” కీ ముందు ఒప్పుకున్న ప్రాజెక్టులు.
దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులు కీలకంగా మారాయి. ప్రభాస్ చేతులు ఎప్పుడూ నాలుగు సినిమాలు ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్”, బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్టు కే”, మారుతి దర్శకత్వంలో “డీలక్స్ రాజా” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు సినిమాలలో ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. జూన్ నెలలో “ఆది పురుష్”, సెప్టెంబర్ నెలలో “సలార్” సినిమా విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ప్రభాస్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అనీ ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం. కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో ప్రశాంత్ నీల్ స్టార్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించడం తెలిసిందే. దీంతో పాన్ ఇండియా లెవెల్ లొ ఇమేజ్ ఉన్న ప్రభాస్…తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటానికి రెడీ అవటం సంచలనంగా మారింది. “కేజిఎఫ్” రెండు సినిమాలు అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. ముఖ్యంగా సెకండ్ పార్ట్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాతో ప్రశాంత్ నీల్ కెమెరాకు రికార్డులు క్రియేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!