రష్యా విమానానికి మరో సారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. రెండు వారాల క్రితం మస్కో (రష్యా) నుండి గోవా వచ్చిన ఓ అజుర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలాన్ని సృష్టించింది. అది మరువక ముందే తాజాగా రష్యా నుండి గోవాకు బయలుదేరిన ఓ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు రావడంతో దారి మళ్లించారు. 238 మంది ప్రయాణీకులు, ఇద్దరు సిబ్బందితో మాస్కో నుండి బయలుదేరిన అజుర్ ఎయిర్ విమానం దక్షిణ గోవాలోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా, అది గగనతలంలో ఉండగానే డబోలిమ్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తి నుండి సదరు విమానంలో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ వచ్చింది.
దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. విమాన సిబ్బందికి అధికారులు సమాచారం అందించారు. సదరు విమానం ఇంకా భారత గగనతలంలోకి రాకపోవడంతో పైలెట్ విమానాన్ని ఉజ్జెకిస్తాన్ కు మళ్లించారు. ఈ విషయాన్ని గోవా ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు వారాల క్రితం ఇదే విధంగా వచ్చిన బాంబు బెదిరింపు తో మాస్కో నుండి బయలుదేరిన విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ లోని జామ్ నగర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేసి తనిఖీలు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ఫేక్ బెదిరింపేనని అధికారులు తేల్చారు.
డల్లాస్ (అమెరికా) లో తెలుగు వ్యక్తి అరెస్టు .. ఏ కేసులో అనేది తెలిస్తే అసహ్యించుకుంటారు