హైదరాబాదు: లక్ష్మీస్ ఎన్టిఆర్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల కానివ్వకుండా అడ్డుకున్నందుకు ఈసి నిర్ణయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికపై ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును అనుసరించే తాము నేడు సినిమా విడుదలకు ప్లాన్ చేసుకున్నామనీ, ఈసి తమ పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని అరోపించారు.
సినిమా విడుదలకు అనుమతించిన తరువాత ఇలా చేయడం ఏంటని వర్మ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనకున్న బలమైన శక్తి ఎవరో అందరికీ తెలుసునని వర్మ వ్యాఖ్యానించారు.