YS Viveka Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో సారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్ లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డును ఇవ్వాలని కోర్టును కోరారు అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసులో ఇటీవల అవినాష్ రెడ్డిని పలు మార్లు విచారించింది. ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హజరైయ్యారు. అయితే హత్య కేసులో విచారణకు హజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయన వినతిని కోర్టు నిరాకరించింది. అయితే తీర్పు వెలువరించే వరకూ పిటిషనర్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
మరో వైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో నాల్గవ నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఇదే అంశంపై వివేకా పీఏ కృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు కలిపి ధర్మాసనం విచారించింది. దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగానే సీబీఐ విచారణ జరుపుతోందనీ, నిందితుడు ఇచ్చిన వ్యాంగ్మూలం ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కరరెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారని భాస్కరరెడ్డి ఆరోపించారు.
హత్య లో కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని, హత్య ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని చెప్పారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని బాస్కరరెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిందని, ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్ తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. కనీసం సీసీ పుటేజ్ ను కూడా సీబీఐ పరిశీలించలేదని హైకోర్టుకు తెలిపారు. దీనిపై రేపు వాదనలు కొనసాగనున్నాయి.
విచారణకు హజరు కావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు .. పోలీసులపై బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్ ఫైర్