కింగ్ నాగార్జున ప్రస్తుం మన్మథుడిగా మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈయనతో రాహుల్ రవీంద్రన్ తెరుకెక్కిస్తోన్న లవ్ ఎంటర్టైనర్ `మన్మథుడు 2`. 2003లో విడుదలైన మన్మథుడికి ఇది సీక్వెల్. రకుల్ ప్రీత్ సింగ్ ఓ హీరోయిన్గా నటిస్తోంది. సమంత అక్కినేని కీలక పాత్రలో నటిస్తోంది. కాగా..లెటెస్ట్ సమాచారం ప్రకారం ఇందులో నాగార్జునతో మరో హీరోయిన్ జోడి కట్టనుందట. మరో హీరోయిన్ కోసం యూనిట్ కీర్తిసురేష్తో చర్చలు జరుపుతుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అంతా సవ్యంగా జరిగితే ముగ్గురు స్టార్ హీరోయిన్స్ నటించే చిత్రమిదే అవుతుంది. నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!