Pawan Kalyan: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరగబోయే అనేక విషయాలు గురించి ముందే తెలియజేస్తూ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ఈయన చెప్పిన కొన్ని విషయాలు నిజమవుగా మరికొన్ని కాలేదు. ప్రాముఖ్యంగా వేణు స్వామి చెప్పిన సంగతులలో సమంత నాగచైతన్య విడాకుల గొడవ ఆయనకు పేరు తీసుకురావడం జరిగింది. నాగచైతన్య..సమంత విడాకులు తీసుకుంటారని పెళ్లికి ముందే వేణు స్వామి తెలియజేశారు. ఆయన చెప్పినట్లుగానే 2017లో పెళ్లి కాక 2021 లో విడాకులు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అంతేకాదు 2023లో చంద్రబాబు జైలుకెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఆ రకంగానే ఏపీ రాజకీయాలలో పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో వేణు స్వామి మాటలు జనం నమ్మటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు గురించి ఇంకా పలు సెలబ్రిటీల జీవితాలు గురించి ఇటీవల వేణు స్వామి తెలియజేస్తున్నారు. అయితే 2024 కొత్త ఏడాదికి సంబంధించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలలో తాజాగా పవన్ కళ్యాణ్ గురించి వార్త వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలపరంగా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా వివాదాలు చోటు చేసుకుంటాయి. వాటన్నిటిని ఎదుర్కోవటం తప్పదు.
పవన్ కళ్యాణ్ కి చెప్పేవారు లేక రాజకీయా భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. 2024లో మూడోసారి పవన్ విడాకులు తీసుకుంటారు. ఆయన కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట వింటారు. కానీ త్రివిక్రమ్ పవన్ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోలేరు. కాబట్టి పవనే మేలుకొని ఏ రకంగా ముందుకెళ్తే ముఖ్యమంత్రి అవుతారో..? దాని గురించి ఆలోచించుకోవాలి. ఆయనను సీఎంగా చూడాలనుకునే వారిలో నేను కూడా ఒకడిని. కానీ అది అర్థం చేసుకోకుండా ఆయన అభిమానులు నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అంటూ వేణు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా త్వరలో ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!