ED: అక్రమ మైనింగ్ కేసులో ఈడీ అధికారులు ఓ మాజీ ప్రజాప్రతినిధి నివాసంలో సోదాలు జరుపుతుండగా పెద్ద ఎత్తున నగదు, నగలు, విదేశీ తుపాకులు బయటపడటం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం అయ్యింది. హరియానా మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ నివాసంలో అక్రమ మైనింగ్ కేసులో ఇడీ అధికారులు నిన్నటి నుండి సోదాలు జరుపుతున్నారు.
ఈ సోదాలో విదేశాల్లో తయారైన తుపాకులు, వంద మద్యం బాటిళ్లు, కేజీల కొద్దీ బంగారం, వెండి, కోట్ల రూపాయల నగదు గుర్తించినట్లుగా విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. దిల్ బాగ్ సింగ్, ఆయన అనుచరుల కు చెందిన ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. గురువారం ఉదయం మొదలైన ఈ సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. సోదాల అనంతరం ఈడీ అధికారులు అధికారికంగా సమాచారం విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల .. ఏపీలో ఏ పార్టీకి ప్లస్..? ఏ పార్టీకి మైనస్ ..?