అనంతపురం డిసెంబర్ 26: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపట్ల వ్యవహారిస్తున్న తీరుకు నిరసనగా గత కొద్దికాలంగా ఆంధ్రలో టీడీపీ శ్రేణులు ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు మధ్యానం 2 గంటలకు అనంతపురంలో టీడీపీ శ్రేణులు నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షకు సీఎం చంద్రబాబునాయుడు, ఎంపీలు, మంత్రులు పాల్గొననున్నారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా సభసజావుగా జరగడానికి ముందస్తుగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్’ చేశారు.