ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిజెపి ఎమ్మెల్యే కులదీప్ సెనగర్పై ఆ పార్టీ వేటు వేసింది. హత్యాయత్నం ఘటనపై ప్రతిపక్షాలు బిజెపిపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేపై బిజెపి బహిష్కరణ వేటు వేసింది. అత్యాచార ఆరోపణల కేసు నమోదు అయి దాదాపు ఏడాదిన్నర తరువాత ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేయడం గమనార్హం.
బాధితురాలు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉన్నావ్ అత్యాచర ఘటన మరో సారి తెరపైకి వచ్చింది. సెనగర్ అతని బంధువులు బాధితురాలిని రో డ్డు ప్రమాదం పేరుతో హత్యచేయాలని ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ప్రమాదానికి కారణమైన లారీ నంబర్ ప్లేట్ మీద నలుపురంగు పెయింట్ వేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి బదిలీ చేసింది.