విజయవాడ: సీఎం జగన్ అభిప్రాయం ప్రకారం ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమైతే, 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యంగా అన్నారు. జగన్ వైఖరి చూస్తుంటే తుగ్లక్ ను మించిపోయి తుగ్లక్ ముత్తాతలా ఉన్నాడని విమర్శించారు. శాసనసభ్యుల బలం ఉంది కదా అని ఇష్టంవచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, ఓ ప్రకటన చేసేముందు ఆచరణ సాధ్యమో, కాదో పరిశీలించుకోవాలని హితవు పలికారు. చేతనైతే ప్రతి ఊరిని రాజధాని తరహాలో అభివృద్ధి చేయాలి కానీ, రాజధానిని మార్చడం సరికాదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు.
ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రా కి మూడు రాజధానులు అవసరమైతే ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు పన్నెండు రాజధానులు కావాలి.
— Kesineni Nani (@kesineni_nani) December 18, 2019