NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒకే ఒక్క ఆటో డ్రైవర్ – జగన్ వల్ల ఎంత బెనిఫిట్ పొందాడో చూడండి

అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని సంక్షేమ పథకాలు అన్నీ పచ్చ చొక్కాల వారికే కట్టబెట్టారనీ ఎన్నికల ముందు వైసీపీ నేతలు పదేపదే ఉపన్యాసాలలో దంచేశారు. వైసీపీ అధికారం రావడంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని హామీలు ఇచ్చారు. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ టీడీపీ సానుభూతి పరులకు 40 శాతంకు పైగా సంక్షేమ పధకాలు మంజూరు అవుతుండటంతో వైసీపీ శ్రేణులు అవాక్కు అవుతున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాడే గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా సంక్షేమ పథకాల మంజూరులో కులం, మతం, పార్టీ అనే భేదాలు లేకుండా అర్హులందరికీ అందిస్తామని ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు అదే విధంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో నగదు బదిలీ పథకాలు గొప్పగా అమలు జరుగుతున్నా పార్టీ శ్రేణులకు పెద్దగా మైలేజీ రావడం లేదని భావిస్తున్నారు. 40 శాతంకు పైగా టీడీపీ శ్రేణులు లబ్ది పొందుతున్నారని వారు వైసీపీకి ఓటు వేసే రకాలు కాదని పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో అమలు అవుతున్న నగదు బదిలీపై వైసీపీ నేతలు ఏమంటున్నారనే దానిపై ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల కోట్లది మంది లబ్ధి పొందుతున్నారు. నగదు బదిలీ వల్ల గ్రామాల్లో కొన్ని కుటుంబాలు ఎంతగా లాభ పడుతున్నాయో అనే విషయాలు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు.

ప్రకాశం జిల్లాలో ఓ టీడీపీ సానుభూతిపరుడైన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఈ పథకాల వల్ల భారీగా లబ్ధి భారీగా చేకూరిందట.. ఆ ఆటో డ్రైవర్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు. వారిలో అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో వీరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు, జగన్ అన్న విద్యా దీవెన కింద రూ.20వేలు, ఆటో డ్రైవర్ కావడంతో ఆ పథకంలో రూ.10 వేలు, అతని భార్య టైలర్ కావడంతో ఆ పథకం కింద రూ.10వేలు, రైతు భరోసా కింద రూ.7500తో పాటు ప్రధాని మోడీ ఇచ్చిన 6000 తో రూ.13500 లబ్ధి చేకూరాయి. మొత్తం ఆ కుటుంబానికి అక్షరాల రూ.68,500 సాయం జగన్ ప్రభుత్వంలో అందింది. ఇది గమనించిన వైసీపీ శ్రేణులు అవాక్కు అయ్యారుట. తాము పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా ఈ మాదిరి సాయం అందలేదంటూ వాపోవడం వారి వంతు అయింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. సీఎం జగన్ ఎంత డబ్బులు ఇచ్చినా నా ఓటు మాత్రం ‘టీడీపీకే’ అని సదరు ఆటో డ్రైవర్ చెప్పడం. ఈ మాటలు విని వైసీపీ శ్రేణులు షాక్ అయ్యారట. ఇది గమనించి అయినా పార్టీ కోసం కష్టపడినవారికి న్యాయం జరిగేలా నాయకులు కృషి చేయాలని వారు కోరుకుంటున్నారుట.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju