ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తీరుపైన టిడిపి వర్గాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండగా హైకోర్టులో కూడా అతన్ని అరెస్టు చెల్లదని ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు అరెస్టు ద్వారా జగన్ ప్రభుత్వం మరొక కీలక టిడిపి నేతను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేత ఎర్రన్న కుమారుడు రామ్ మోహన్ నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దాదాపు అతనే పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేదని ఖరారు అయిపోయినట్లే. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న వైసిపి సోషల్ మీడియా వర్గాలు రామ్ మోహన్ నాయుడు ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ లోనే రామ్ మోహన్ నాయుడు పై విరుచుకు పడిన తీరును గమనించవచ్చు. ఈ తతంగం దాదాపు రెండు వారాల పాటు నడిచింది.
సరే దీనికి అచ్చెన్నాయుడు కేసు కి లింక్ ఏమిటని అనుకుంటున్నారా? కనీసం ముప్పై ఏళ్ళ వయసు కూడా లేని ఒక యువకుడు 30 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న పార్టీ యొక్క ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి తెలుగుదేశం పార్టీ నేతల వరుస అరెస్టులు జరిగితే అతనిపై మొదట్లోనే భారీ ఒత్తిడి పడుతుంది.
ఇప్పటికే రామ్ మోహన్ నాయుడు పలు సందర్భాల్లో వైసిపి పార్టీ పై విరుచుకుపడిన తీరు చూసి జగన్ ఈ వ్యూహం రచించాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ కొత్త టిడిపి ప్రెసిడెంట్ ను కుదురుకోనివ్వకుండా చేస్తాడా లేదా యువరక్తం వైసిపి పార్టీకి షాకిస్తుందా అన్నది వేచి చూడాలి.