ప్రధాని మోడీ ఇటీవల రెండు రోజుల పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ విధి విధానాల గురించి, కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది. ఇలా అనేక విషయాల గురించి మోడీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజెంట్ దేశంలో లాక్ డౌన్ దశ ముగిసి…అన్ లాక్ ల దశ స్టార్ట్ అయ్యిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
కాగా సమావేశంలో కేసీఆర్…. మళ్లీ దేశం మొత్తం లాక్ డౌన్ అమలవుతోంది అనే వార్తలపై ఇప్పుడే ప్రజలకి క్లారిటీ ఇవ్వండి అంటూ మోడీని కోరారు. ప్రజెంట్ దేశంలో ఈ వార్త ఎక్కువ వైరల్ అవుతోంది…ముఖ్యమంత్రుల సమావేశం లోనే మోడీ లాక్ డౌన్ ప్రకటిస్తారు అన్న వార్తలు వస్తున్నాయి, కాబట్టి స్పష్టత ఇవ్వాలి అని తెలిపారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.