నల్గొండ(తెలంగాణ), జనవరి 22: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం జర్పులతండా పంచాయితీ సర్పంచ్ టాస్తో విజయం సాధించారు. ఈ పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసలు బలపర్చిన అభ్యర్ధులు జర్పుల చిన్నగోరి, జర్పుల నిర్మలకు 169 ఓట్లు చొప్పున పోలయ్యాయి.
అభ్యర్ధులిద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో పోలింగ్ అధికారులు టాస్ వేయగా నిర్మల గెలుపొందింది.
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం తొలివిడత పంచాయితీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు అధికసంఖ్యలో విజయం సాధించారు.
previous post
next post