హైదరాబాద్, జనవరి 22: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ భారతీయ జనతాపార్టీ నేతలు గవర్నర్ నరసింహన్కు వినతిప్రతం అందజేశారు. రాజ్భవన్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ డిజిపి దినేష్రెడ్డి గవర్నర్ను మంగళవారం కలిశారు.
దేవస్థానంలో అక్రమాలపై విజిలెన్స్, ఈడిని విచారణకు ఆదేశించాలని గవర్నర్ను కోరినట్లు వారు తెలిపారు.
హైదరాబాద్కు చెందిన రాజ్కుమార్రెడ్డి అనే వ్యక్తి తిరుమల సేవల టిక్కెట్ల పేరుతో 20లక్షల రూపాయలను వసూలు చేశాడనీ పలువురు బాధితులు ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు.