అచ్చెన్నాయుడు ని ఎలాగైనా కటకటాల వెనక్కి పంపాలని ఏసీబీ అధికారులు చాలా బలమైన దృక్పథంతో ఉన్నారు. అందుకే కోర్టు వారి దగ్గర సరైన ఆధారాలతో మరియు బలమైన వాదనలతో అతనిని ఆసుపత్రిలోనే విచారించేందుకు పర్మిషన్ తీసుకున్నారు. అలాగే తాజాగా మరొక పది రోజులు కూడా అతని రిమాండ్ ను పొడిగించింది ఎందుకు అన్నీ ప్రయత్నాలు చేసి చివరికి సఫలం అయ్యారు. ఈ క్రమంలో అధికారులు అచ్చెన్న ను అడుగుతున్న ప్రశ్నలన్నింటినీ…. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్న ఈఎస్ఐ అధికారులు చెప్పే వివరాలను బట్టే ఉంటున్నాయని అన్నారు. ఆ రెండింటికీ మధ్య లింక్ ను కనిపెట్టి అచ్చెన్నాయుడు ని ఇరుకున పెట్టాలని వారి వ్యూహంగా కనిపిస్తోంది.
ఇక న్యాయమూర్తుల సమక్షంలో ఎసిబి అధికారులు అచ్చెన్నాయుడికి వరుసబెట్టి విచారణ స్టేషన్స్ చేపట్టగా బయటికి వస్తున్న వార్తల ప్రకారం అతను చెప్పే ప్రతి సమాధానం తనను తాను కాపాడుకోవడంతో పాటు మొత్తం అధికారులు పై నెట్టేసే విధంగా ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు మాటల వల్ల రానున్న రోజుల్లో అతని పార్టనర్ గా చెప్పబడుతున్న మరొక మాజీ మంత్రి పై ఏసీబీ వారు గుర్తు పెట్టినట్లు చెబుతున్నారు.
ఆంధ్ర సచివాలయం హైదరాబాద్ లో ఉన్న సమయంలో మూడు సిఫారసు లేఖలు, అమరావతి కి వచ్చిన తర్వాత మరో రెండు సిఫారసు లేఖలు అచ్చెన్న జారీ చేశారని ఈఎస్ఐ అధికారులు వెల్లడించారు. అయితే ఈ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టెలి హెల్త్ కు సంబంధించి కొనుగోలు జరిగిన సమయంలో తాను కార్మిక శాఖ మంత్రి కాను అని చెప్పడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా ఈఎస్ఐ కుంభకోణం కేసు రూపు మారిపోయింది. ఇంకా అతను చెప్పిన సమాధానం ఏమిటంటే అన్ని ప్రభుత్వ విభాగాల్లో లేఖలు పంపడం సర్వసాధారణమైన విషయం అని… అందులో తను అబద్దం చెప్పవలసినది ఏమీ లేదని.. అలాగే అతనిని నేరస్తుడిగా రుజువు చేసేందుకు ఏమీ లేదని అన్నారు.
అంటే…. ఆ సమయంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ పై తదుపరి విచారణ ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మిక శాఖ లో బడ్జెట్ కి మించి ఖర్చు పెట్టారని ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. అంతేకాకుండా రెండో క్వార్టర్లో కేటాయించిన దానికంటే అదనంగా 34.05 కోట్లను ఎక్కువగా ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ మోమోను అభయన్స్లో పెట్టాలని 2018 ఫిబ్రవరి మాసంలో అప్పటి మంత్రి పితాని సత్యానారాయణ ఆదేశాలు జారీచేశారంట. దీంతో ఈ విషయంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు ఆరాతీశారని.. అచ్చెన్న చెబుతున్న సమాధానాలు, విజిలెన్స్ అధికారులు రాబట్టిన సమాచారాలను బట్టి చూస్తే… నెక్స్ట్ పితానే అనే మాటలు వినిపిస్తున్నాయి!