టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో చుక్కెదురైంది. టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి పై జరిగిన హత్యాయత్నం కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, మరో ఇద్దరిని పోలీసులు నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో హజరు పరిచారు. వీరికి మెజిస్ట్రేట్ 14 రోజలు రిమాండ్ విధించారు. ఈ సందర్భంలో ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరించారు. దీంతో మాజీ మంత్రి అఖిలప్రియను ఇతర నిందితులను కర్నూలు జైలుకు పోలీసులు తరలించారు.
నిన్న నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి పై అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవి సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పలీసులు ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఈవేళ ఉదయం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, ఆమె అనుచరులను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఏపి ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీలకు పచ్చజెండా .. ఇవీ మార్గదర్శకాలు