NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Tenth Exams: విద్యార్ధులకు అలర్ట్ .. రెండు రాష్ట్రాల్లో నేటి నుండి టెన్త్ పరీక్షలు .. కీలక సూచనలు ఇవి

Tenth Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించడంతో పాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో సుమారు 11.5 లక్షల మంది విద్యార్ధుల పరీక్షలు రాయనున్నారు. రెండు రాష్ట్రాల్లో పరీక్షలు రాసే విద్యార్ధులకు ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి ప్రభుత్వాలు.

Alert for students tenth exams from today in two states

ఏపిలో..

ఏపిలో ఈ రోజు నుండి 18వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల కోసం 3,449 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపిలో మొత్తం 6,64,152 మంది రెగ్యులర్ విద్యార్ధులు పరీక్షలు రాయనుండగా, సప్లమెంటరీ విద్యార్ధులు 53,410 మంది ఉన్నారు. మొత్తం 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో 156 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులతో సమన్వయం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో ..

తెలంగాణ వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హజరుకానున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  విధుల్లో 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్ష కొనసాగనుంది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్ధుల కోసం అయిదు నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. 9.35 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్ధుల పరీక్షలకు హజరు కానుండగా, వారిలో 76.5 శాతం మంది ఇంగ్లీషు మీడియానికి చెందిన విద్యార్ధులు ఉండటం విశేషం. ఈ రోజు నుండి 13వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.

ఏపిలో విద్యార్ధులకు కీలక సూచనలు ఇవి

ఉదయం 8.45 నుండి 9.30 లోపు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతి ఉండదు.

ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ లు, బ్లూటూత్ పరికరాలు తీసుకురాకూడదు.

అత్యవసర పరిస్థితుల్లో మినహా మధ్యాహ్నం 12,45 గంటల లోపు విద్యార్ధులు బయటకు పంపరు.

వాటర్ బాటిల్, పెన్, పెన్సిల్, ఇతర స్టేషనరీని సెంటర్ లోకి తీసుకువెళ్లవచ్చు.

కేబినెట్ విస్తరణలపై కీలక అప్ డేట్ ఇచ్చిన మాజీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N