Big Breaking: గత కొద్ది నెలలుగా ఏపి ప్రభుత్వం, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ను ఏపీ సిఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని అయన నివాసానికి చేరుకున్న ఏపి సిఐడీ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు.
తొలుత రఘురామ కృష్ణంరాజు కు ఆయన భద్రత సిబ్బంది రక్షణ వలయం గా నిలిచారు. తమ పై అధికారుల నుండి అనుమతి తీసుకున్న తరువాత అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. ఉన్నతాధికారుల నుండి వారు అనుమతి తీసుకున్న తరువాత సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రఘు రామ కృష్ణం రాజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రోజునే అరెస్ట్ జరగడం తీవ్ర సంచలనం అయ్యింది.