YS Sharmila Son Raja Reddy Engagement: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి. అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో గురువారం రాత్రి ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్. భారతి దంపతులు హజరై కాబోయే నూతన జంటకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సమేతంగా ఫోటోలు దిగారు. వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు అందరూ నూతన జంటతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా ఈ నిశ్చితార్ధ వేడుకలో వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కేవిపీ రామచంద్రరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కుమారుడి నిశ్చితార్ధం, వివాహానికి రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల నేతలను వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.
YSRCP: వైసీపీ నాల్గవ జాబితా వచ్చేసింది .. చిత్తూరు లోక్ సభ అభ్యర్ధిగా డిప్యూటి సీఎం నారాయణ స్వామి