ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వైసీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేస్తూ మిఠాయిలు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జన్మదిన కోలాహాలం నెలకొంది. జన్మదిన వేడుకల్లో సీఎం జగన్ తో మంత్రులు, సీఎంఓ అధికారులు కేక్ కట్ చేయించారు. మంత్రులు, అధికారులు కేక్ తినిపించి, బొకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తానేటి వనతి, విడల రజిని, జోగి రమేష్, ఆర్కే రోజా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా సీఎం జగన్ కు ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తదితరుుల ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఎం శ్రీ వైయస్.జగన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసి సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు.#HBDYSJagan pic.twitter.com/mTnZ4oLZyF
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 21, 2022