NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: హస్తినకు చేరుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! పర్యటన రద్దు చేసుకున్న ఏపి సీఎం జగన్..! కారణం ఏమిటంటే..?

YSRCP: Party Internal Big Issues Causing Loose

AP CM YS Jagan: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు ఓ మంచి సన్నివేశాన్ని మిస్ అయ్యారు. ఢిల్లీలో రేపు జరగనున్న ఓ సమావేశంలో ఆసక్తికరమైన సన్నివేశాలు ఆవిష్కృతం అవుతాయని అందరూ భావించారు. కానీ ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి డిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ సీన్ మిస్ అవుతున్నారు. ఇంతకూ విషయం ఏమిటంటే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి గురు శిష్యుల బందంగా ఎంతో ఆప్యాయంగా ఉన్న తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ లు గత కొన్ని నెలలుగా ఎడ మోహం, పెడ మోహం గా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసిఆర్ హజరైయ్యారు. తెలంగాణలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అతిధిగా జగన్మోహనరెడ్డి వెళ్లారు. కేసిఆర్ నివాసంలో విందుకు జగన్ హజరైయ్యారు. విభజన సమస్యలు అనేకం పెండింగ్ లో ఉన్నా కేసిఆర్ కోరిన వెంటనే హైదరాబాద్ లో ఏపి ప్రభుత్వ ఆధీనంలోని భవనాలను జగన్ ఎటువంటి షరతులు లేకుండానే అప్పగించేశారు. ఇలా ఉన్న వారు ఒక్క సారిగా శతృవులుగా ఎలా అయిపోయారు అనేది చాలా మందికి అంతుబట్టడం లేదు.

AP CM YS Jagan delhi tour cancelled
AP CM YS Jagan delhi tour cancelled

ఆంధ్రా ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్. తెలంగాణలోని ప్రాజెక్టులపై ఏపి ప్రభుత్వం కేంద్రానికి, బోర్డులకు ఫిర్యాదు చేసుకోవడం తెలిసిందే. కేసిఆర్ – జగన్ ల మధ్య విబేధాలు ఏమీ లేవనీ, ఇదంతా ఓ డ్రామా అని కూడా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు అనుకోండి. అది వేరే విషయం. ఆదివారం ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసిఆర్, జగన్ లు పాల్గొంటారని అందరూ అనుకున్నారు. అందుకు షెడ్యుల్ కూడా ఖరారు అయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాల జల జగడం పంచాయతీ తరువాత చాలా రోజులకు వీరు ఇద్దరు ఎదురెదురు పడిన సందర్భంలో ఇంతకు ముందు మాదిరిగా మాట్లాడుకుంటారా? లేదా ముభావంగా ఎవరి పని వారు చూసుకుని వెళ్లిపోతారా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

file photo
file photo

ఈ తరుణంలో జగన్ పర్యటన రద్దు కావడం ఆ పరిణామాలను గమనిద్దామనుకున్న వారు నిరుత్సాహానికి గురైయ్యారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం కేసిఆర్ హస్తినకు శుక్రవారం రాత్రి చేరిపోగా జగన్ పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. ఏపి సీఎం జగన్ శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణకింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో వైద్యులు పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో జగన్ డిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళుతున్నారు. ఆమెతో పాటు ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ హజరవుతారు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju