CM YS Jagan: విజయవాడ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బస్టాండ్ లో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. బస్సు ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు సీఎం జగన్ కు తెలియజేశారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాం మీదకు దూసుకువెళ్లడంతో ఈ ఘటన జరిగిందని వివరించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెగురైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడ బస్టాండ్ లో ఆటో నగర్ నుండి గుంటూరు వైపు వెళ్లే బస్సు ఫాట్ ఫాంపై దూసుకువెళ్లగా ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో కండక్టర్ తోపాటు ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KCR: సీఎం కేసిఆర్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. అప్రమత్తమైన పైలట్