Ap High court: సంగం డెయిరీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండి గోపాలకృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు నేడు వారికి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వారు ఇద్దరు కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంగం డెయిరీ లో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో ఏసీబీ వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆరెస్టు అనంతరం దూళిపాళ నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జైలు నుండి ఆసుపత్రికి తరలించారు. కరోనా తగ్గిన తరువాత ఆయనను పోలీసు అధికారులు మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు అనుమతి లేకుండా జైలుకు తరలించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆసుపత్రిలోనే వారిని ఉంచాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.